టాలీవుడ్ ప్రిన్స్ ఆస్తిపై గులాబీ బాస్ ఎటాక్ చేయటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన పద్మాలయ స్టూడియో పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రభుత్వ భూముల అక్రమాణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్ రావు దూకుడు అందరికి తెలిసిందే. కేసిఆర్ సర్కార్ ఇప్పటికే గురుకుల్ ట్రస్ట్, అయప్ప సోసైటి, ఎన్ఎప్డీసీ, ఏపీ ఎన్జీవోలు నుండి భూములను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే కేసిఆర్ సర్కార్ ఫిలింనగర్ లోని నటుల ఆస్తులపై చర్యలు చేపట్టింది. ముందుగా నటుడు నాగార్జున ఆస్తీపై ..జీఎచ్ఎంసీ ముద్ర వేసింది. ఇది ప్రభుత్వ భూమి అని నాగార్జున ఎన్.కన్వెన్షన్ బిల్డింగ్ పై తెలంగాణ బోర్డు పెట్టింది. ఇక ఇప్పటికే ఒక లిస్ట్ తయారు చేసి దాని ప్రకారం ఆస్తులను కేసిఆర్ సర్కార్ స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇప్పుడు మహేస్ బాబు సంబంధించిన 9 ఎకరాల పద్మాలయా స్టూడియో పై గులాబీ సర్కార్ వేగం పావులు కదుపుతుంది. అదంతా ప్రభుత్వ భూమిగా అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ సీఎం పేషీకి నివేదిక సమర్పించినట్టు తెలిసింది. సదరు ప్రభుత్వ ఆస్థిని మళ్లీ తమ పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు వినికిడి.

అయితే పద్మాలయ స్టూడియో పై ఎటాక్ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయని గులాబీ బాస్ కు కొంతమంది గులాబీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటుడు నాగార్జన ఎన్ కన్వెషన్ కేసు విషయంలో కోర్టు నుండి చీవాట్లు పడిన విషయాన్ని కేసిఆర్ కు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తొందరపడి మహేష్ బాబు ఆస్తుల పై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని సీఎం కేసిఆర్ కు ఆయన ముఖ్య సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో కేసిఆర్ సర్కార్ చట్టాలను తూ. చ పాటిస్తే.. ప్రజల్లో మంచి నమ్మకం ఉంటుందనే ఉద్దేశంతో గులాబీ సర్కార్ మహేష్ బాబు ఆస్తుల ఎటాక్ పై వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే తాత్కాలిక ఉపశమనమే అని గులాబీ నేతలు అంటున్నారు. గులాబీ బాస్ ఎటాక్ నుండి సూపర్ స్టార్ కృష్ణ , ప్రిన్స్ మహేష్ బాబు, పద్మాలయ స్టూడియో ఎలా కాపాడుకుంటారో చూడాలి.
No comments:
Post a Comment