చాలా మంది ప్రముఖులు తన జీవితం పై, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు అన్నీ పుస్తక రూపంలో నలుగురికి తెలియపరిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ జీవితాల పై పుస్తకాల్ని రాసుకున్నారు. రాయించుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తమ జీవితం పై ఓ పుస్తకాన్ని రాయాలని డిసైడ్ అయ్యినట్లు సమాచారం.
దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా టాలీవుడ్ వెండితెరను తనదైన శైలిలో ఏలిక చిరంజీవి, కొన్ని సంవత్సరాల క్రితం నటనకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కేంద్రమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్ నాయకుడుగా పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. అయితే తన సినీ జీవితంలో మిగిలిపోయిన 150వ సినిమాను మాత్రం పూర్తి చేస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ పనిలో పడ్డాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.
దాని కోసం బాడీ కసరత్తుల కూడా చేస్తున్న చిరు రాయబోయే పుస్తకంలో కెరియర్ లో అంచెలంచెలుగా ఎదిగిన తీరు, తనతో పని చేసిన దర్శక, నిర్మాతల, కథానాయికలతో అనుభవాలు, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, పార్టీని నడపటంలో ఎందుకు, ఎక్కడ విఫలం అయ్యేమనే విషయాలే కాకుండా, తన 150 సినిమాల సంగతలు, రాజకీయాల ఆలోచనలు ఆ పుస్తకంలో ప్రస్తావించబోతున్నాడట. అయితే ఈపుస్తకాన్ని చిరు స్వయంగా రాస్తారా ? లేకుంటే ఎవరైనా ప్రముఖ రచయితతో రాయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో చాలా మంది తన జీవిత పుస్తకాల్ని రాసి అందులో చాలా ఆసక్తికర నిజాలు బయట పెట్టి పెద్ద వివాదాలే రేపారు. మరి చిరు రాయబోయే పుస్తకం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
No comments:
Post a Comment